అవినీతి పై అలుపెరగని పోరాటం చేస్తున్న అన్నా హజారే ను జైలులో పెట్టి భారత దేశంలో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎంత నీచమైన స్థాయికి దిగాజారిపోయారో ప్రజలందరికీ నిస్సిగ్గుగా వెల్లడించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నా.
అక్రమ సంపాదన, అధికార దాహంతో ప్రజా ప్రతినిధులుగా వెలిగిపోతున్న ప్రస్తుత రాజకీయనాయకులు అవినీతి, అక్రమ సంపాదనలను అడ్డుకోడానికి సహకరించే ఏ బిల్లు నైనా ఆమోదింప చేస్తారని ప్రజలు భావించడం అత్యాసే. ప్రధాని, పార్లమెంట్, శాసన సభ్యులు మొదలుకొని గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబరు వరకు ప్రజా ధనాన్ని లూటీ చేయడంలో వున్నా ఆసక్తి మరి ఎందులోనూ లేదు. ఈజిప్టు లాంటి దేశానికి ముబారక్ లాంటి వాళ్ళు ఒక్కరో, ఇద్దరో ఉండవచ్చు కానీ భారత దేశంలో కొన్ని వందలమంది ముబారక్ లు చెలరేగి పోతున్నారు.
ప్రస్తుత పరిస్తుతులలో అన్నా చెప్పినట్టు మరో స్వాతంత్ర పోరాటం నిష్కలమైన పరిపాలన కోసం చెయ్యక తప్పదు. ఈ రోజు అన్నా హజారే అరెస్ట్ ప్రజాస్వామ్య వాదులను ఒకవైపు కంట తడి పెట్టిస్తూ మరోవైపు గుండెలు మండిస్తుంది. ప్రజాగ్రహానికి నిలబడిన రాజ్యాలు చరిత్రలో లేవు...ఇదే సరైన సమయం సమస్త ప్రజలు పిడికిలి బిగించి అక్రమార్కులను రాజకీయాలనుండి తరమడానికి, అది తొందరలోనే సిద్దిస్తుందని ఆశిద్దాం.





